పురాణాలలో హూలీ… ప్రాకృతిక రంగేళి

హూలీ జరుపుకున్న ప్రతి ఒక్కరు రంగులతో తడిసి నూతన సౌందర్యాన్ని తెచ్చుకుంటారు. నగలూనట్రా మంచి దుస్తులు వేసుకుంటేనే సౌందర్యంగా కనబడతారని చాలామంది అనుకుంటారు. కానీ మహాకవి పింగళి సూరన కళాపూర్ణోదయమనే కావ్యంలో అసలైన సౌందర్యం ఎక్కడుందో చెప్పాడు. సహజ సౌందర్యం ప్రకృతిలో కనిపించేంది ఖచ్చితంగా ఈ శిశిర ఋతువులోనే. ఈ ఫల్గుణ మాసంలోని పూర్ణిమనాడు వికసించే చంద్ర కాంతికి మనస్సు ఆకాశం నుంచి విరబూసే వెండివెన్నెలలో విహరించాలని తహతహ లాడుతుంది. అందుకే మన పెద్దలు ఈ హూలికా పూర్ణిమను ఫల్గుణ పూర్ణిమనాడు ఏర్పాటు చేశారు. తెలుగు సంవత్సరాదిలో వచ్చే నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. పాల్గుణ మాసంలో వచ్చే ఫాల్గుణ పౌర్ణమిని మహా ఫాల్గుని, డోలికా పూర్ణిమ అని హూలికా పూర్ణిమ అని కూడా అంటా ఫాల్గుణ పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిగా మారిన పరమేశ్వరుడికి హమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకున్నారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగించాడు. తపో భంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామద#హనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు. మరోక పురాణకథ చూస్తే హిందూ పురాణల ప్రకారం హూలి జరుపుకోవడానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రహ్ణాదుడు మహావిష్ణువు భక్తుడు. ఆయన తండ్రి హిరణ్య కశ్యపుడు విష్ణువును వ్యతిరేకిస్తాడు. విష్ణువును ఆరాదించడం మానుకోవాలని ప్రహ్లాదుడుని హెచ్చరిస్తాడు. అయితే ప్రహ్లాదుడు తండ్రి మాట వినడు దీంతో హిరణ్య కశ్యపుడు కొడుకును చంపమని ఆదేశిస్తాడు. హిరణ్య కశ్యపుని సోదరి హూలిక ప్రహ్లాదుని చంపబోయి తాను దహనమవుతుంది. ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకుని హూలీ పండుగను నిర్వహిస్తారని కొందరంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను ‘వసంతోత్సవం’ పేరిట జరుపుకునేవారు. హిందూ పురాణాల్లో ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు తెలుపుతున్నాయి. హూలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హూలీ పర్వదినం ఏటా ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఫాల్గుణ పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణ వ్రతం చేసి స్వామిని ఊయలలో ఉంచి జోలపడతారు. కాబట్టి దీనీని డోలికా పూర్ణిమ అంటారు. కృష్ణ భగవానున్ని ఊయల్లో వేసిన వేడుకకు గుర్తుగా బెంగాల్‌లో డోలికోత్సవాన్ని జరుపుకుంటారు. పాల్గుణ పౌర్ణమి మరుసటి రోజు నుండే వసంత మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు చందనంతో సహా మామిడి పూతను తిన్నవారు సంవత్సరమంతా సుఖంగా ఉంటారు. శాస్త్రాల ప్రకారం.. వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది జ్వరం, జలుబు లాంటి వ్యాధులను నివారించడానికి కొన్ని ఔషద మొక్కల నుంచి తయారు చేసిన స#హజ రంగులు కలిపిన నీళ్ళను జల్లుకుంటారని చెబుతుంటారు. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, .మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు. దీనిని జల్లుకోవడం వలన వ్యాధులు తొలగిపోతాయని నమ్ముతుంటారు. హూలికాను దహనం చేయడం వలన చెడుపై మంచి విజయం గెలిచింది.

  • శ్రీధర్‌ వాడవల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *