High funding | ఆదరించండి.. అభివృద్ధి చేస్తా
- ప్రచారంలో దూసుకుపోతున్న మామిండ్ల వీరయ్యపల్లె కాంగ్రెస్ పార్టీ సర్పంచి అభ్యర్థి
- మామిండ్ల వీరయ్య పల్లె కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఏడాకుల సరోజన సంపత్ రెడ్డి
High funding | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : మామిండ్ల వీరయ్య పల్లె గ్రామ ప్రజలు ఆదరించి కత్తెర గుర్తుకు ఓటేసి ఆశీర్వదించి సర్పంచిగా గెలిపిస్తే మామిండ్ల వీరయ్య పల్లె గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఏడాకుల సరోజన సంపత్ రెడ్డి అన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో గ్రామానికి అధిక నిధులు(High funding) తీసుకొచ్చి గ్రామంలోని గత ప్రభుత్వం చేయని, మిగిలిన పనులను పూర్తి చేసి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి, ఏడాకుల సరోజన సంపత్ రెడ్డి ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు.
గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో దొంతి మాధవ రెడ్డి ఆశీస్సులతో మామిండ్ల వీరయ్య పల్లె గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గ్రామాన్ని మరింత అభివృద్ధి పథం(development trajectory)లోకి తీసుకెళ్లేందుకు తాను అహర్నిశలు కష్టపడి గ్రామంలో మిగిలిపోయిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులతో పాటు, అర్హులైన వారికి పెన్షన్స్, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు ఇప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
యువతీ యువకులకు ఆయా కులాల కార్పొరేషన్ రుణాలను ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలోని సమస్యలను తీర్చేందుకు అధికారుల(officials)తో సమన్వయం చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

