అమరావతి : మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan)సత్తెనపల్లి పర్యటనలో.. కారు ఢీకొని సింగయ్య మృతి (Singaiah’s death) చెందిన విషయం తెలిసిందే. అయితే సింగయ్య మృతికి జగన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొనడమే కారణం అని తేలడంతో.. జగన్ పై కేసులు నమోదయ్యాయి. దీంతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court)లో లంచ్ మోషన్ పిటిషన్ (Lunch Motion Petition) దాఖలు చేశారు.
అయితే కోర్టు వెంటనే విచారించేందుకు నిరాకరించి.. ఈ రోజుకు వాయిదా వేసింది. కాగా ఈ రోజు జగన్ క్వాష్ పిటిషన్పై విచారణ జరగాల్సి ఉండగా.. రేపటికి వాయిదా వేసింది. సింగయ్య మృతి కేసు (Singaiah death case)లో జగన్ క్వాష్ పిటిషన్తో పాటు.. అన్ని పిటిషన్ల విచారణ రేపటికి హైకోర్టు వాయిదా వేసింది. సింగయ్య మృతి కేసులో జగన్పై చర్యలు తీసుకోవద్దని ఆయన తరుఫున న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. కానీ ఏపీ హైకోర్టు వారి వాదనలపై ఎలాంటి ఆదేశాలను ఇవ్వలేదు. దీంతో ఈ రోజు కూడా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ను నిరాశే ఎదురైంది.