విశాఖ: సన్ రైజర్స్ జట్టుకు ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) బంపర్ ఆఫర్ ఇచ్చింది. పన్ను మినహాయింపులు, ఇతర సహకారం అందిస్తామని పేర్కొంది. హెచ్ సీఏతో సన్ రైజర్స్ వివాదం తరుణంలో ఏసీఏ ఆహ్వానం పలికింది.
ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లను విశాఖలో నిర్వహించాలని ప్రతిపాదించామని ఏసీఏ పేర్కొంది. ఎస్ఆర్ హెచ్ జట్టు నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నామంది. ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ ల ఉచిత పాస్ ల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ను హెచ్ సీఏ తీవ్రంగా వేధిస్తుండడంతో ఆ ప్రాంఛైజీ నగరాన్నే వీడి వెళ్తామని హెచ్చరించింది.