Tirumala | మఠాన్ని అప్పగించండి… శార‌దా పీఠంకు టీటీడీ నోటీసులు

తిరుమ‌ల‌లోని విశాఖ‌ శార‌దా పీఠం మ‌ఠానికి షాక్ త‌గిలింది. తిరుమ‌ల‌లో ఈ పీఠం వారు టీటీడీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఒక భ‌వ‌నం నిర్మించారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఈ భ‌వ‌న నిర్మాణం జ‌రిగింది. ఈ అక్ర‌మ నిర్మాణంపై హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ సంఘాలు హైకోర్టును ఆశ్ర‌యించాయి. ఈ విష‌య‌మై విచార‌ణ జ‌రిపిన ఏపీ హైకోర్టు టీటీడీకి అనుకూలంగా తీర్పును వెల్ల‌డించింది.

దీంతో ఈ భ‌వ‌నాన్ని టీటీడీ స్వాధీనం చేసుకునేందుకు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. అక్ర‌మ నిర్మాణాల‌కు సంబంధించి నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే ఆ నిర్మాణాల‌ను కూల్చి వేయాల‌ని న్యాయ‌స్థానం పేర్కొంది. ఈ తీర్పుతో తాజాగా విశాఖ‌ శార‌దా పీఠం వారు నిర్మించిన మ‌ఠానికి ఈరోజు టీటీడీ నోటీసులు జారీ చేసింది. ప‌దిహేను రోజుల్లోగా మ‌ఠం ఖాళీ చేసి వెళ్లిపోవాల‌ని, అలాగే ఆ భ‌వ‌నాన్ని త‌మ‌కు అప్ప‌గించాల‌ని టీటీడీ ఎస్టేట్ నోటీసుల్లో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *