ఢిల్లీ | విభజన చట్టం అపరిష్కృత అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో అమరావతి-హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు డీపీఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని హోంశాఖను ఆదేశించింది. అదేవిధంగా త్వరలో అమరావతి రింగ్ రోడ్డు ప్రక్రియ ప్రారంభం కానుంది. మరోవైపు తెలంగాణలో ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ మొదలైంది.
ఏపీలో మరో రిఫైనరీ ఏర్పాటును పరిశీలించాలని పెట్రోలియం శాఖను కేంద్రం ఆదేశించింది. అదేవిధంగా విశాఖ, విజయవాడ, హైదరాబాద్, కర్నూల్ కారిడార్ల ఏర్పాటును రైల్వేశాఖ పరిశీలించనుంది. పలు సమస్యల పరిష్కారానికి పలు శాఖలకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.