నాలుగు రాష్ట్రాలు అప్రమత్తం
- ఏపీ, తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు
- మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక
- కడప, అక్టోబర్ 25(ఆంధ్రప్రభ) : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని.. రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడి.. ఎల్లుండి తుఫాన్గా మారే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్కు థాయిలాండ్ సూచించిన మేరకు ‘మంతా’గా నామకరణం చేసినట్లు తెలిపారు. తుఫాన్ ఈ నెల 28న మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ దగ్గరలో తీరం దాటుందని తెలిపారు. దీని ప్రభావంతో 90-110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ప్రస్తుతం పోర్ట్బ్లెయిర్కు పశ్చిమ-నైరుతిలో 420 కి.మీ దూరంలో, కాకినాడకు ఆగ్నేయంగా 1000 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయినట్లు తెలిపారు.
- తుఫాన్ ప్రభావం ఏపీ, తమిళనాడు, ఒడిశా, బెంగాల్లో తీవ్రంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుఫాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్య్సకారుల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

