Caste Census: సీఎం రేవంత్ రెడ్డితో మాజీ కేంద్ర సహాయ మంత్రి భేటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ కేంద్ర సహాయ మంత్రి అరుణ్ సుభాష్ చంద్రయాదవ్ భేటీ అయ్యారు. సమగ్ర కుల సర్వే నిర్వహించి, ఓబీసీల సాధికారత కోసం డేటాను ఉపయోగించాలనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్రెడ్డిని అభినందించడానికి సోమవారం సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
కులగణన చారిత్రాత్మక నిర్ణయమని అఖిల భారత ఓబీసీల సంఘం, మధ్యప్రదేశ్ ఓబీసీ, ఎంపీ యాదవ సమాజం తరఫున సీఎం రేవంత్రెడ్డికి అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా, సీఎం రెడ్డి ఓబీసీ సాధికారతలో దేశం మొత్తానికి రోల్ మోడల్గా నిలిచినందుకు అనేక మంది ప్రముఖ ఓబీసీ నాయకులు, సామాజిక కార్యకర్తలు అభినందిస్తున్నారని తెలిపారు.