108 చెంచు జంటల వివాహానికై..
అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట(Atchampeta) పట్టణంలో ఆదివారం నాడు ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ వనవాసీ కళ్యాణ పరిషత్ వారు నిర్వహించబోయే సామూహిక వివాహా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో మొత్తం 108 చెంచు జంటలు వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు.
ఈ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnudev Verma, Governor ) ముఖ్య అతిథిగా విచ్చేసి, నూతన దంపతులకు ఆశీర్వచనాలు అందించనున్నారు.

