Encounter | నలుగురు మావోయిస్టుల మృతి

Encounter | నలుగురు మావోయిస్టుల మృతి
Encounter | బీజాపూర్, ఆంధ్రప్రభ : మావోయిస్టు (Maoist) పార్టీ అగ్రనేతల వరుస లొంగుబాట్ల నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజాపూర్ (Bijapur) జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం మావోయిస్టులు–భద్రతాదళాల మధ్య ఉధృతంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ (Encounter) లో ఇప్పటి వరకు నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో ఆ ప్రాంతంలో భద్రతా విఘాతం లేకుండా అదనపు బలగాలను మోహరించినట్లు తెలుస్తోంది.
