నాణ్యమైన విద్యను అందించేలా కృషి…

నాణ్యమైన విద్యను అందించేలా కృషి…

దండేపల్లి, ఆంధ్రప్రభ : విద్యార్థులు ఇప్పటి నుండి కష్టపడి చదివితేనే భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు సాధిస్తారని జిల్లా విద్యాధికారీ ఎస్. యాదయ్య(District Education Officer S. Yadayya) పేర్కొన్నారు. ఆయన ఈ రోజు దండేపల్లి మండలంలోని వెల్గనూరు ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఎస్ ఏ 1 పరీక్ష(SA 1 Exam)లో వచ్చిన మార్కులను పరిశీలించారు. ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ నాణ్యమైన విద్యను అందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న తీరు పరిశీలించారు. నాణ్యమైన కూరగాయలు(quality vegetables), సరుకులు వాడాలన్నారు. ఆయన వెంట ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బోలిశెట్టి రాజన్న ఉన్నారు.

Leave a Reply