Mahabubabad | పల్లెల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి.. యశస్విని రెడ్డి

తొర్రూరు, జూన్20 (ఆంధ్రప్రభ) : పల్లెల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి (Yashaswini Reddy) అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా తొర్రూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సి సబ్ ప్లాన్ నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు, డ్రైనేజ్ పనులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాజకీయాలకు, పార్టీలకతీతంగా గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరచనున్నట్టు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో అంతర్గత రహదారులు (Internal roads) ఏర్పాటు చేసి పల్లెల ప్రగతికి బాటలు వేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో తాగు, సాగునీరు ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చేయనున్నట్టు హామీనిచ్చారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్నట్లు తెలిపారు.

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు (Indiramma houses) అందిస్తున్నట్లు తెలిపారు. ఎవరూ అధైర్య పడవద్దని, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. పేదలకు సన్న బియ్యం అందించి వారి కడుపు నింపుతున్నామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు సైతం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో పుల్లారావు, మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, కాంగ్రెస్ నాయకులు రామ సహాయం కిషోర్ రెడ్డి, డా. పోనుగొటి సోమేశ్వరరావు, గంజి విజయపాల్ రెడ్డి, పెదగాని సోమయ్య, చిత్తలూరి శ్రీనివాస్ గౌడ్, మంగళపల్లి రామచంద్రయ్య, జీనుగా సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అనుమాండ్ల దేవేందర్ రెడ్డి, పేరటి యాకుబ్ రెడ్డి, అశోక్ రెడ్డి, గంజి ప్రసాద్ రెడ్డి, రవీంద్ర చారి, విక్రం రెడ్డి, రాజేష్ యాదవ్, పింగిలి ఉష, రవి నాయక్, మెరుగు మల్లేశం, తూనం శ్రావణ్, మిత్తింటి హరీష్, వెన్నెం సోమిరెడ్డి, రామలింగం, బాలకృష్ణ, బచ్చలి లక్ష్మణ్, మోకాటి వెంకన్న, నల్లమాస మహేష్, అభిరామ్, మహేష్ యాదవ్, గిరిధర్, మురళి, పరుశురాములు, చంటి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply