మారేడుమిల్లి, (ఆంధ్రప్రభ ) అల్లూరి జిల్లా మారేడుమిల్లి (Maredumilli ) మండలంలో వాలమూరు (valamuru ) వాగులో ఇద్దరు యువకులు ( Youth )గల్లంతయ్యారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్ టి ఆర్ జిల్లా (NTR district ) విజయవాడ చెందిన ఆరుగురు యువకులు నేడు మారేడుమిల్లి పర్యాటక ప్రాంతాలకు విహారయాత్రకు వచ్చారు. దీనిలో భాగంగా మారేడుమిల్లి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వాలమూరు వాగులో స్నానాలకు దిగి సాధిష్ (23),కటకం రవి తేజ(30)లు ప్రమాదవాసాత్తు వాగులోనికి స్నానానికి దిగి ప్రవాహానికి గల్లంతయ్యారు.
దీంతో హటహుటిన స్నేహితులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీశారు. స్థానికులు వాగులోనికి దిగరాదని, ఈ వాగుల అనేకమంది మృత్యువాత పడ్డారని హెచ్చరించినా నిర్లక్ష్యంతో వాగులోనికి దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వాగు సమీపంలో స్థానిక అటవీశాఖ, పోలీసులు హెచ్చరిక బోర్డులు పెట్టిన యువత పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు తెలిపారు.
మృత్యువాత పడ్డ సాధిష్ ఫోటో గ్రాఫర్ గాను,రవితేజ విజయవాడలో కారు ట్రావెల్స్ నిర్వర్తిస్తున్నరని సహచరులు వెల్లడించారు. సమాచారం అందుకొన్న మారేడుమిల్లి సి ఐ సీహెచ్ గోపాల కృష్ణ, గుర్తేడు ఎస్ ఐ పార్ధసారధి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని వాగులో గాలింపు చర్యలు ముమ్మరం చేసారు. దీనిపై మారేడుమిల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.