శాశ్వత అన్నదాన పథకానికి విరాళం
బాసర, ఆంధ్ర ప్రభ : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి(Basara Sri Gyan Saraswati Devi) అమ్మవారి శాశ్వత అన్నదాన పథకానికి ఈ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మినుమనూరి శేఖర్ పుష్పలత(Shekhar Pushpalatha) దంపతులు రూ. లక్ష విరాళం అందజేశారు.
ఆలయ కార్యాలయంలో ఆలయ ఈవో అంజనీ దేవి(Anjani Devi)కి శాశ్వత అన్నదాన పథకం నిమిత్తం ఈ నగదును విరాళంగా అందించారు. ఈ సందర్భంగా విరాళం అందజేసిన దంపతులచే ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించి, ఆశీర్వచన మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, వైదిక బృందం పాల్గొన్నారు.
అమ్మవారి ప్రసాదం అందుకుంటున్న దంపతులు
