ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 రోజుకో థ్రిల్లర్ మ్యాచ్తో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. కాగా, నేడు మరో ఉత్కంఠ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. నేడు జరగనున్న 48వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ – కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడనున్నాయి.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ సొంత మైదానంలో తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో కోల్ కతా జట్టు ముందుగా బ్యాటింగ్ చేపట్టనుంది.
తుది జట్లు :
కోల్కతా నైట్ రైడర్స్ : రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రోవ్మన్ పావెల్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి.
ఢిల్లీ క్యాపిటల్స్ : ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్.
ధనాధన్ ఢిల్లీ.. వెనుకబడ్డ కేకేఆర్ !
ఇదిలా ఉండగా, ఈ సీజన్ ఐపీఎల్లో అక్షర్ పటేట్ నాయకత్వంలో అద్భుతంగా రాణిస్తున్న ఢిల్లీ… నేటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్పై విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులో తమ అవకాశాలను బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం 9 మ్యాచుల్లో 6 విజయాలు, 3 ఓటములతో 12 పాయింట్లు సాధించిన ఢిల్లీ 4వ స్థానంలో ఉంది.
మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ల పరిస్థితి గందరగోలంగా ఉంది. అజింక్య రహానె నాయకత్వంలోని కోల్కతా నైట్ రైడర్స్ టిష్టంగా ఉన్నప్పటికీ.. ఇబ్బంది పడుతోంది. గత మూడు మ్యాచ్ల్లో వరుసగా రెండు ఓటములతో పాటు.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసులో కేకేఆర్ వెనుకబడిపోయింది. ప్రస్తుతం 9 మ్యాచ్ల్లో 3 విజయాలు, 4 ఓటములతో పాటు ఒక మ్యాచ్ రద్దు అయింది. దీంతో కోల్కతా జట్టు 7 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది.