సైబర్ నేరాలు గ్రామాలకు విస్తరించాయ్
- డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం
- రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ
- సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడి
చేవెళ్ల, ఆంధ్రప్రభ : సైబర్ నేరాలు పల్లెలకు విస్తరించాయని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి(Commissioner Avinash Mahanty) వెల్లడించారు. ఈ రోజు చేవెళ్ల పోలీస్ స్టేషన్ ను ఆయన సందర్శించారు. పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్, నూతన ఓలా స్కూటీలను ప్రారంభించారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. ఫిర్యాదులు, పెట్రోలింగ్, కేసుల చేదన, కోర్టు కేసులు, రౌడీ షీటర్స్ పై నిఘా, మిస్టరీ(Surveillance, Mystery కేసుల ఇన్వెస్టిగేషన్, నేరాల తగ్గింపుకు చేస్తున్న ప్రయత్నాలు తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. గతంలో సైబర్ నేరాలు పట్టణ ప్రాంతంలో మాత్రమే జరిగేవి, కానీ ప్రస్తుతం సైబర్ నేరాలు గ్రామాల్లో సైతం జరుగుతున్నాయన్నారు.
గత సంవత్సరం 13 వేల కేసులు కట్టగా, రూ.780 కోట్లను సైబర్ నేరస్థులు(Cyber Criminals) కాజేశారు. ప్రస్తుతం ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన వచ్చింది. డిజిటల్ అరెస్టులు కూడా తగ్గాయి. ఈ సంవత్సరం సైబర్ నేరాలు 25% తగ్గుతాయని ఆయన అంచనా వేశారు.
డ్రగ్స్ గంజాయి పై ఉక్కుపాదం..
డ్రగ్స్, గంజాయి పై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సీపీ అవినాష్ మహంతి స్పష్టం చేశారు. చేవెళ్ల ప్రాంతంలో 1000కి పైగా ఫామ్ హౌస్ లు ఉన్నాయి. తరచూ ఫామ్ హౌస్లో ఈవెంట్లు జరుగుతుంటాయి. డ్రగ్స్ , గంజాయిల(Drugs, Cannabis)పై ఎన్నో కేసులు కట్టాము. గంజాయి, డ్రగ్స్ సప్లై దారులపై ప్రత్యేక నిఘా పెట్టామని వివరించారు.
సీసీ కెమెరాలు ప్రజల ఆస్తి..
నేర పరిశోధణ, రోడ్డు ప్రమాదాల నివారణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని సీపీ అవినాష్ మహంతి అన్నారు. చేవెళ్ల కంట్రోల్ రూమ్ లో 551 సీసీ కెమెరాలు, 12 ఎల్ఈడి స్క్రీన్ ల(12 LED screens)ను స్థానిక ప్రజలు సహకారంతో టీవీలు ఏర్పాటు చేశాము. చేవెళ్ల పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూంతో చేవెళ్ల పట్టణం, 20 గ్రామ పంచాయతీలను అనుసంధానం చేయడం జరిగింది.
కెమెరాల పనితీరు పరిశీలించేందుకు సాంకేతిక పరమైన టీంను ఏర్పాటు చేశాం. మరమ్మత్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ను స్థానిక ప్రజల సహకారంతో ఏర్పాటు చేశామన్నారు. డీసీపీ, ఏసీపీ, సీఐలు, ఎస్ ఐలను, సిబ్బందిని ఆయన ప్రశంసించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ..
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు సిపి అవినాష్ మహంతి తెలిపారు. ఈ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీస్(gated communities), రిసార్ట్స్, కమర్షియల్ ప్రాజెక్ట్ లు ఎన్నో వచ్చాయి. దీంతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. రోడ్డు విస్తరణ పనులు సాంకేతికపరంగా ప్రస్తుతానికి నిలిచిపోయాయి. దీంతో రోడ్డు ప్రమాదాలు తరచూ జగుతున్నాయి.
ఇందులో ద్విచక్ర వాహన చోదకులు రోడ్డు ప్రమాదాల బారిన ఎక్కువగా పడుతున్నారు. ప్రమాదాల నిర్మూలనలో భాగంగా బ్లాక్ స్పాట్స్(black spots) గుర్తించి, బోల్ గాడ్స్ రిఫ్లెక్టెడ్ స్టేట్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొత్తానికి చేవెళ్ల పోలీస్ స్టేషన్ పనితీరు ప్రశంసనీయంగా ఉందని ఆయన కితాబునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్(DCP Yogesh Gautam), అదనపు డీసీపీ కె. శ్రీనివాస్ రావు, సీఐ భూపాల్ శ్రీధర్, డిఐ(సీఐ) జె. ఉపేందుర్, ఎస్ఐ లు సంతోష్ రెడ్డి, వనం శిరీష ,తేజశ్రీ, బి. శిరీష తదితరులు ఉన్నారు

