కొత్తకోట : తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు (road accident) ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటెయినర్ లారీని ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.

మహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లాలోని అడ్డాకుల మండలం కాటావరం స్టేజి సమీపంలో ఇవాళ తెల్లవారుజామున 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటెయినర్‌ లారీని ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ( Private travels bus) బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు హైదరాబాద్ (Hyderabad) నుంచి ప్రొద్దుటూరు (Proddutur) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మృతులను అష్రస్‌ ఉన్నిసా (70), హసన్ (35), ఎల్లమ్మ (45)గా గుర్తించారు. క్షతగాత్రులను 108 వాహనంలో మహబూబ్‌నగర్ (Mahbubnagar) ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు (Investigate) చేపట్టినట్లు అడ్డాకుల ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

Leave a Reply