Commissioner | తనిఖీల్లో 173 వాహనాలు సీజ్

Commissioner | వరంగల్, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా 57 ముఖ్యమైన ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 9 గంటల పోలీసులు నిర్వహించిన నాకాబందీ తనిఖీల్లో(In inspections) పోలీసులు మొత్తం 8259 వాహనాలను తనిఖీ చేయగా, ఎలాంటి పత్రాలు లేని 173 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఇందులో 9 కార్లు, 158 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, ఒక ట్రాక్టర్ సీజ్ చేయబడ్డాయి.
అలాగే ఈ తనిఖీల్లో అక్రమ మద్యంకు సంబంధించి మొత్తం 7 కేసులు నమోదు చేసి, ఒక లక్ష రూ. 18 వేల మద్యంతో పాటు మూడు లీటర్ల గుడంబా, లక్ష యాభై వేల రూపాయల నగదు, ఎలాంటి అనుమతులు లేకుండా వాహనంలో రవాణా(Transportation by vehicle) చేస్తున్న రూ. 49 వేల విలువ గల బాణాసంచా పోలీసులు స్వాధీనం చేసుకోగా, ట్రాఫిక్ పోలీసులు ఐదు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. వీటితో పాటు మడికొండ పోలీసులు భట్టుపల్లి గ్రామంలో తనిఖీల్లో మిస్సింగ్ కేసు(Missing case)లో కనిపించకుండా పోయిన ఒక వ్యక్తిని పోలీసులు గుర్తించడం జరిగిందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.
