Colligium | సుప్రీం కోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు

న్యూ ఢిల్లీ | గౌహతి, కర్నాటక హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సహా ముగ్గురు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ అంజరియా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజయ్ బిష్ణోయ్, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సూచించింది.

మాజీ సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ కన్నా, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌ ఇటీవల పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. ఖాళీలను నియమించేందుకు ముగ్గురి పేర్లను చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం నిర్ణయించింది. జస్టిస్ బేలా ఎం త్రివేది సైతం జూన్‌ 9న పదవీ విరమణ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 34 కాగా.. ప్రస్తుతం 31 మంది న్యాయమూర్తులు ఉన్నారు.

Leave a Reply