AP | 1న పాడేరులో సీఎం ప‌ర్య‌ట‌న‌.. ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన కలెక్టర్

పాడేరు, జూన్ 26 : జూలై 1వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లా (పాడేరు) లో జరగనున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu Naidu) పర్యటించనున్నారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి విచ్చేస్తున్న నేప‌థ్యంలో సంబంధిత ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ (Dinesh Kumar), జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, ఇత‌ర అధికారుల‌తో కలసి గురువారం ఉదయం పాడేరు (paderu) మండలం లగిశపల్లిలో హెలిప్యాడ్ స్థలాన్ని, బహిరంగ సభ నిర్వహణ స్థలాన్ని అలాగే పెన్షన్ పంపిణీ పంపిణీ చేయ‌నున్న‌ ఉగ్గంగొయ్యి గ్రామాన్ని ప‌రిశీలించారు.

ముఖ్య‌మంత్రి స‌భాస్థలికి చేరుకునే ద‌గ్గ‌ర నుంచి తిరుగుప‌య‌న‌మ‌య్యే వ‌ర‌కు ప‌టిష్ట ఏర్పాట్లు చేయాల‌ని సంబంధిత అధికారుల‌కు సూచించారు. ఈ స్థల పరిశీలన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ, డి.ఎస్.పి షేక్ అహమ్మద్ షహాబాజ్, జిల్లా గ్రామీణా భివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి పి మురళీ, తహసీల్దార్ వి.త్రినాథరావు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply