కోర్టు సినిమాతో రోషన్ హీరోగా అరంగ్రేటం
అభినందించిన టీపీపీసీ సభ్యుడు బుడగం శ్రీనివాస్
యాద్రాద్రి, ఆంధ్రప్రభ : భద్రాచలం బిడ్డ హీరో రోషన్ చలనచిత్ర రంగంలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. భద్రాచలం నివాసి రషీద్ కుమారుడు హీరో రోషన్ హీరో నాని తాజాగా నిర్మించిన “కోర్టు” సినిమా ద్వారా హీరోగా అరంగ్రేటం చేశారు. అతి చిన్న బడ్జెట్ చిత్రాన్ని హిట్గా మార్చి, అందరి మన్ననలను- అభినందనలు అందుకుంటున్న రోషన్ కి హైదరాబాద్ లోని తన ఆఫీసుకి ఆహ్వానించి టీపీసీసీ సభ్యుడు బుడగం శ్రీనివాస్ అభినందించారు.
భద్రాచలం ప్రముఖుల ప్రోత్సాహం
రోషన్ ఎదుగుదలకి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు భద్రాచలం ప్రముఖుల అండదండలు మెండుగా ఉన్నాయి. భద్రాచలం పట్టణ ప్రముఖ కాంట్రాక్టర్ హలీంఖాన్ వద్ద రోషన్ తండ్రి రషీద్ ఒక సాధారణ అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. తన కుమారుడి టాలెంట్ ని అతి చిన్న వయసులోనే గుర్తించి, భద్రాచలం టౌన్ లోని రాజేష్ తమ్మళ్ల డ్యాన్స్ మాస్టర్ వద్ద నాలుగేళ్ల వయస్సు నుండే నృత్యంలో మెలుకవలు నేర్పించారు. రోషన్ ని ఉన్నత స్టేజ్ లో చూడాలనే ఆశయంతో రషీద్ ఎంతో కష్టపడ్డాడు. అందుకోసం అనేక రకాలుగా హలీం ఖాన్ దోహదపడ్డాడు అని స్థానికులు తెలుపుతున్నారు.
భద్రాచలం వాసులు సక్సెస్ గర్వకారణం
భద్రాచలం నివాసి రోషన్ హీరోగా తెరకెక్కిన కోర్టు సినిమా పెద్ద హిట్ సాధించడంతో బుడగం శ్రీనివాస్ హీరో తండ్రిని హైదరాబాదులో ఉన్న తన ఆఫీసుకి ఆహ్వానించారు. భద్రాచలం వాసులు ఇటువంటి సక్సెస్ సాధించటం గర్వకారణమని శ్రీనివాస్ అన్నారు. హీరో రోషన్తో బుడగం శ్రీనివాస్ కేక్ కట్ చేసి చిరు సత్కారం చేసి శుభాకాంక్షలు తెలిపారు. బుడగం శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు కళారంగం పట్ల ఉన్న మక్కుతో కళాకారులను ప్రోత్సహిస్తున్నానని చెప్పారు. టాప్ పొజిషన్లో యాంకర్గా ఉన్న సుమాని, క్యారెక్టర్ ఆర్టిస్టు, హాస్యనటుడు శ్రీనివాసరెడ్డిని ప్రొడ్యూసర్గా సంకెళ్లు అనే టీవీ సీరియల్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తిగా అందరికీ బుడగం సుపరిచితుడే.