Chittoor | ఏడుగురు విద్యార్థులకు గాయాలు

Chittoor | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఆర్ పురం సమీపంలోని గ్రామాల నుండి స్కూల్ బస్సు విద్యార్థులను తీసుకుని జీడీనెల్లూరు వైపు వెళ్తుండగా.. బీసీ కాలనీ వద్ద లారీ వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయపడగా.. ఇందులో ఓ విద్యార్థికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన విద్యార్థులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply