టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్కు ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పాకిస్థాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ తెలిపాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం టాస్ పెద్ద విషయమే కాదన్నాడు. గత మ్యాచ్ తరహాలోనే ఆడి విజయం అందుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.