Road Accident |కారులో మంటలు.. ఇద్దరు సజీవ దహనం

పెద్ద అంబర్ పేట : ఔటర్ రింగ్ రోడ్డుపై పెద్ద అంబర్‌పేటలో ప్రమాదం జరిగింది. ఓ వాహనాన్ని కారు ఢీకొట్టింది. దాంతో మంటలు చెలరేగి రెండు వాహనాలు కాలిపోయాయి. ఇవాళ‌ తెల్లవారుజామున దాదాపు మూడు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆగి ఉన్న వాహనాన్ని టాటా క్వారీ వాహనం ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రెండు వాహనాలు కాలిపోయాయి. ప్రమాదం సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులున్నారు. ఇందులో ఇద్దరు సజీవ దహనం కాగా.. మరొకరిని మంటల నుంచి కాపాడి దవాఖానకు తరలించారు.

శంషాబాద్ వైపు నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తుండగా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం గండిచెరువు సమీపంలోని ఓఆర్ఆర్‌పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, ఓఆర్‌ఆర్‌ అవతలి వైపు ఓ వాహనం ప్రమాదానికి గురై డివైడర్‌ను ఢీకొట్టింది. వారికి సహాయం చేసేందుకు ఈ వాహనాన్ని పక్కనే ఆపినట్లు సమాచారం. ఈ సమయంలో ఆగి ఉన్న వాహనాన్ని కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదంలో రెండు వాహనాలు దాదాపు కాలిపోయాయి.

పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ తర్వాత సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అబ్దుల్లాపూర్‌ మెట్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను హైదరాబాద్‌లోని బహదూర్‌పుర హెచ్‌బీ కాలనీకి చెందిన దీపేశ్‌ అగర్వాల్‌ (23), విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన సంచయ్‌ మల్పాని (22), మూసాపేటకు చెందిన ప్రియాన్షు మిట్టల్‌ (23)గా పోలీసులు గుర్తించారు.

Leave a Reply