బూర్గంపాడు ఆంధ్రప్రభ):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం గౌతమ్ పురం ఆర్ అండ్ బి రోడ్డు నుండి సోంపల్లి జెడ్ పి రోడ్డు వరకు సుమారు 90 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న బిటీ రోడ్డు పనులకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల పల్లె గ్రామాలు అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదని ప్రతి ఒక్క నిరుపేదకు రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన ఆయన వెంట పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. జిల్లా అధికారులు, మండల అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Burgampadu | గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యం : మంత్రి పొంగులేటి….
