Shabad | దుర్గా వైన్స్ వ‌ద్ద దారుణ‌హ‌త్య‌

షాబాద్, మార్చి 13 (ఆంధ్రప్రభ) : షాబాద్ మండల కేంద్రంలోని దుర్గా వైన్స్ లో బుధవారం రాత్రి చోరీ జ‌రిగింది. వైన్స్ లో దొంగతనానికి వచ్చిన దుండగులు మద్యం దొంగతనంతో పాటు వైన్స్ లో పనిచేస్తున్న బిక్షపతి రాత్రి అక్కడే నిద్రిస్తుండడంతో గమనించిన దొంగలు అతని నిర్ధాక్షణంగా కొట్టి చంపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *