ఉమ్మడి వరంగల్ బ్యూరో – ఆంధ్రప్రభ హనుమకొండ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న బిఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి ఆ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు ఇచ్చారు.. వరంగల్ జిల్లాలో నేడు పర్యటించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి దగ్గర జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభ ప్రాంగణంలోనే ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ,.. బిఆర్ఎస్ కి ఒక విశిష్టత ఉందన్నారు.. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు రెండు మాత్రమే ఉన్నాయని , వాటిలో ఒకటి బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు.. తెలంగాణ ప్రజల గొంతుగా పార్టీ పేరు తెచ్చుకుంది బిఆర్ఎస్ అన్నారు.. ప్రజలు ఏ బాధ్యత ఇచ్చిన దాన్ని ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తున్న పార్టీ అని కేటీఆర్ పేర్కొన్నారు.
కాగా, ఉద్యమ జిల్లాలో 1250 ఎకరాల ఏర్పాట్లు పరిశీలించామని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఏ మూల నుంచి వచ్చే ఏ ఒక్కరికికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.. 40 వేల వాహనాలు దూరం పెట్టి నడుచుకుంట రాకుండా సభ వేదిక దగ్గరనే పార్కింగ్ సౌకర్యం కల్పించామన్నారు.. నాలుగు ఏరియాలో పార్కింగ్ సౌకర్యాలు ఉంటాయన్నారు వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మంచి నీటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.. 100 వైద్య బృందాలు అందుబాటులో ఉంచామని చెప్పుకొచ్చారు. ఇక, 20 అంబులెన్స్ అందుబాటులో ఉంచాం.. కరెంటు సమస్యలు లేకుండా 200 జనరేటర్లు సిద్ధం చేసుకుంటున్నామని కేటీఆర్ అన్నారు.
తెలంగాణలో చరిత్రలోనే ఇది అతి పెద్ద బహిరంగ సభ కాబోతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ను చూసేందుకు ఆయన మాటలు వినేందుకు పెద్ద ఎత్తున జనం చేందుకు సిద్ధం అవుతున్నారు.. సూర్యాపేట జిల్లా నుంచి, వర్ధన్న పేట నుంచి ఎడ్ల బండ్ల మీద సభకి వస్తున్నారు.. ఉద్యమ స్ఫూర్తి చాటుతున్నారు.. 2000 మంది వాలంటీర్లు పెడుతున్నాం.. నాలాల దగ్గర వాలంటీర్లు పెడుతున్నాం.. ప్రభుత్వం కూడా సహకరిస్తుంది.. మా ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాం.. సాయత్రం 4 గంటలకు కేసీఆర్ సభ వేదికకు చేరుకుంటారు.. ఉదయం జండాలు ఎగురవేసి సభలకు బయలుదేరుతారు.. ఇప్పటి వరకు యంత్రాంగం సహకరిస్తోంది.. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న సభ ఇది కాదని కేటీఆర్ చెప్పారు.