జీడిమెట్ల, (ఆంధ్రప్రభ) : వేగంగా దూసుకొచ్చిన బైక్ యూటర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. సంఘటన జరగగానే ప్రమాదం శబ్దాన్ని పసిగట్టిన జీడిమెట్ల పోలీసులు (Jeedimetla Police ) క్షణాల్లో స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని హుటాహుటిన క్షతగాత్రులను షాపూర్ నగర్ లోని ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
జీడిమెట్ల పోలీసులు స్థానికుల కథనం ప్రకారం… జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం సుమారు 7:30 గంటల ప్రాంతంలో స్థానిక హెచ్ఎంటి యూటర్న్ వద్ద TG 10 JTR 2587 వాహనాన్ని నడుపుతున్న రైడర్ స్థానిక హెచ్ఎంటి యూటర్న్ వద్ద మలుపు తీసుకుంటున్న ఆర్టీసీ బస్సు (RTC bus) ను వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ (Motorcycle) నడిపిస్తున్న శివకాంత్ మది అప్ప ( 19), భాను కిరణ్ నర్సింగ్ రావు (22) అను విద్యార్థులు తీవ్రగాయాల పాలయ్యారు. ప్రమాదం జరగగానే సమీపంలోనే ఉన్న జీడిమెట్ల పోలీసులు హుటాహుటిన క్షతగాత్రులు ఇద్దరినీ షాపు నగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గాయపడిన ఇద్దరు విద్యార్థులు ఓకల హోమా విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.
ప్రమాదం జరగగానే అంబులెన్స్ కోసం ఎదురు చూడకుండా జీడిమెట్ల పోలీస్ ఇన్ స్పెక్టర్ గడ్డం మల్లేష్, ఇతర పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించడంతో గాయపడిన వారికి తక్షణ వైద్యం లభించింది. ప్రమాదంలో గాయాలపాలైన ఇద్దరు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేటట్టు ఆసుపత్రి యాజమాన్యాన్ని పోలీసు ఇన్ స్పెక్టర్ గడ్డం మల్లేష్ కోరారు.