- విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా
- ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు..
- వాటి నిర్వహణకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్స్
- బీసీ సంక్షేమం & రవాణా శాఖలపై ఫ్రీ బడ్జెట్ సమావేశం
అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల అద్దె బకాయిలు వెనువెంటనే చెల్లించేలా ప్రతిపాదనలు తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు స్పష్టంచేశారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొన్నంతో కలిసి బిసి సంక్షేమం & రవాణా శాఖలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఉచిత బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు.
విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో అవసరమైన మరమ్మతులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన నిధులు వెంటనే కేటాయిస్తామని మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తెలిపారు.
బీసీ స్టడీ సెంటర్లు.. ఉద్యోగ కల్పన కేంద్రాలుగా ఉండాలని భట్టి ఆదేశించారు. టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ను అనుసరించి స్టడీ సెంటర్లలో కోచింగ్ నిర్వహించాలన్నారు. డీఎస్సీ, బ్యాంకింగ్ వంటి పరీక్షలపై కూడా దృష్టి సారించాలని ఆదేశించారు.
గురుకులాల్లో ఒకేషనల్ కోర్సులు ప్రవేశం పెట్టడం మూలంగా ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఇక ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు, వాటి నిర్వహణకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు.. ఆర్టీసీ ఆస్తులు, నిర్వహణ, ఆదాయ వనరులపై సమావేశంలో చర్చించారు.