Begumpet | ప్రజాసేవకు జీవితం అంకితం

Begumpet | ప్రజాసేవకు జీవితం అంకితం


మంత్రాల అనూష సుమన్
Begumpet | రాజాపేట, ఆంధ్రప్రభ : త‌న‌కు కేటాయించిన‌ ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే… బేగంపేట గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మంత్రాల అనూష సుమన్ అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో విస్తృత ప్రచారాన్ని కొనసాగించారు.

తమను గెలిపిస్తే ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. గ్రామంలో వైద్య సేవలు అందేవిధంగా చూస్తానని హామీ ఇచ్చారు. అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యా అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. లాభదాయక వ్యవసాయం జరిగే విధంగా ఉద్యాన పంటల ప్రోత్సాహానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తానని చెప్పారు..

Leave a Reply