వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్త..

వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్త..

చైతన్యం..హక్కుల సాధన కరపత్రాన్ని ఆవిష్కరించిన సీఐ

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : వినియోగదారులు ఆకర్షణీయమైన ప్రకటనలకు లోను కాకుండా, వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించాలని హసన్ పర్తి సీఐ వట్టే చేరాలు సూచించారు.ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా హసన్ పర్తి వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ అనుమాండ్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో వినియోగదారుల చైతన్యం హక్కుల సాధన అనే కరపత్రాన్ని స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆవిష్కరించారు.

ఈసందర్బంగా సీఐ మాట్లాడుతూ ప్రతి కొనుగోలు విషయంలో చెల్లించిన డబ్బుకు తప్పనిసరిగా రసీదు పొందినప్పడే,వినియోగదారుల హక్కులకు రక్షణ కలుగుతుందని తెలిపారు. ప్రస్తుత సమాజంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయాయని అలాంటి విషయంలో చాలా జాగ్రత్త అవసరమని,యజమాన్యం ప్రత్యక్షంగా మనకు కనబడకపోవడం వల్ల ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలామంది మోసపోతున్నారని ఇలాంటి మోసాలపై వినియోగదారుల కమిషన్ లో కేసు వేసి నష్టపరిహారాన్ని పొందవచ్చని అన్నారు.

హసన్ పర్తి చైర్మన్ అనుమాండ్ల విద్యాసాగర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని ఈసారి సురక్షితమైన ఉత్పత్తులు నమ్మకమైన వినియోగదారులుగా ప్రకటించిందనిపేర్కొన్నారు. వినియోగదారుడికి మోసం గాని అన్యాయం గాని జరిగినప్పుడు వినియోగదారుల కమిషన్ యందు కేసు వేయవచ్చునని, ఇలాంటి కేసులకు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదని,ఖర్చు లేకుండా పరిహారం పొందవచ్చుని తెలిపారు.


ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దామెరుప్పుల దేవేందర్,రమేష్,మీసరగొండ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply