ఆలయ కమిటీ సభ్యుడిగా బండారు శ్రీనివాసరావు

ఖమ్మం, ఆంధ్రప్రభ : నగరంలోని కమాన్ బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యుడిగా నగరానికి చెందిన బండారు శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన సభ్యుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుమ్మల గారి ఆశీస్సులతో, కమర్తపు మురళి అన్న సూచనలతో ఖమ్మం కమాన్ బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. దేవస్థానం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

Leave a Reply