ఏపీ రేషన్ షాపుల్లో లభ్యం..

కర్నూలు బ్యూరో , ఆంధ్రప్రభ : ఇటీవల వర్షాలతో దెబ్బతిన్నఉల్లి రైతు(Onion farmers)లను ఆదుకునేందుకు రేషన్ షాపుల్లో ఉల్లిపాయలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వస్తోంది. రేషన్ కార్డు ఉన్నవారికి కిలో రూ.14కే ఉల్లిపాయలు ఇస్తారు. ముందుగా కర్నూలు జిల్లాలో నేటి నుంచి ప్రారంభిస్తారు.

అన్ని జిల్లాల్లో(districts)నూ రెండు మూడు రోజుల్లో ఉల్లిపాయలను విక్రయిస్తారు. తొలుత కర్నూలు నగరంలోని 170 రేషన్ షాపుల్లో ఉల్లిపాయలు విక్రయాలు ప్రారంభిస్తారు. ఉల్లి రైతులకు న్యాయం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కర్నూలు మార్కెట్‌లో మద్దతు ధరకు కొన్న ఉల్లిపాయలను రైతు బజార్ల(markets)కు పంపుతున్నారు.

రేషన్ షాపులు, హాస్టల్స్, మధ్యాహ్న భోజన పథకం, అన్న క్యాంటీన్లకు తక్కువ ధరకే ఉల్లి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ అధికారులు ఉల్లిపాయల కొనుగోలు( purchase) ప్రారంభించటంతో వ్యాపారులు కూడా పోటీ పడుతున్నారు. దీనివల్ల ఉల్లి ధర తగ్గడం లేదు. అందుకే ప్రభుత్వం ఉల్లి రైతులకి, కొనేవాళ్ళకి కూడా ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటోంది.

Leave a Reply