Asian Athletics | భారత అథ్లెట్ల జోరు..

  • పసిడితో మెరిసిన తెలుగమ్మాయి నందిని
  • గుల్వీర్‌కు రెండో గోల్డ్‌,
  • హైజంప్‌లో పూజకు స్వర్ణం

ఆసియా అథ్లెటిక్స్ 26వ చాంపియన్‌షిప్‌లో భారత్‌ జోరు కొనసాగుతోంది. శుక్రవారం నాలుగో రోజు కూడా భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. తెలుగమ్మాయి అగసర నందిని మహిళల హెఎ్టాథ్లాన్‌ ఈవెంట్‌లో స్వర్ణంతో మెరిసింది.

మరోవైపు పురుషుల 5000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో భారత స్టార్‌ స్ప్రింటర్‌ గుల్వీర్‌ సింగ్‌, మహిళల హై జంప్‌లో పూజ బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు.

మరో స్టార్‌ అథ్లెట్‌ పారుల్‌ చౌదరీ మహిళల 3000మీ స్టీపుల్‌చేజ్‌లో రజతం గెలుచుకుంది. దీంతో నాలుగో రోజు ముగిసే సరికి భారత్‌ ఓవరాల్‌గా 8 గోల్డ్‌ మెడల్స్‌తో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

చైనా 15 స్వర్ణాలతో అగ్ర స్థానంలో కొనసాగుతుండగా.. జపాన్‌ 4 పసిడిలతో మూడో స్థానంలో ఉంది.

కాగా, దక్షిణ కొరియాలోని గుమీలో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన నందిని మహిళల హెఎ్టాథ్లాన్‌ ఈవెంట్‌లో మొత్తం 5,941 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌లో నిలిచి పసిడిని ముద్దాడింది. దీంతోపాటు ఈ ఘనత సాధించిన మూడో భారత మహిళా అథ్లెట్‌గా కూడా తెలుగమ్మాయి రికార్డు సృష్టించింది.

మహిళల హెఎ్టాథ్లాన్‌ ఈవెంటోలో నందిని కంటే ముందు సోమా బిస్వాస్‌ (2005), స్వప్న బర్మన్‌ (2017) ఇద్దరే ఏషియన్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలు సాధించారు.

మరోవైపు పురుషుల 5000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌ ఫైనల్లో గుల్వీర్‌ సింగ్‌ 13:24.77 సెకన్లలో రేసును ముగించి అగ్ర స్థానంతో స్వర్ణం గెలుచుకున్నాడు. దీంతో పాటు 2015 ఎడిషన్‌లో మొహమద్‌ అల్‌ గర్నీ (ఖతర్‌) నమోదు చేసిన 13:34.47సె. ఆల్‌టైమ్‌ రికార్డును తాజాగా గుల్వీర్‌ బద్దలు కొట్టాడు.

అలాగే ఈ ఎడిషన్‌లో గుల్వీర్‌కు ఇది రెండో గోల్డ్‌ మెడల్‌. అంతకుముందు 10000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లోనూ ఇతడు విజేతగా నిలిచాడు. కాగా, 5000మీ పోటీలో థాయ్‌లాండ్‌కు చెందిన కీరన్‌ టుంటివాట్‌ 13:24.97 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకోగా.. జపాన్‌కు చెందిన నగియా మోరి 13:25.06సె.తో మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు.

మరోవైపు మహిళల 3000మీ స్టీపుల్‌చేజ్‌లో మరో భారత స్టార్‌ అథ్లెట్‌ పారుల్‌ చౌదరీ 9:12.46 సెకన్ల ప్రదర్శనతో సిల్వర్‌ మెడల్‌ సొంతం చేసుకుంది. దీంతో పాటు తన పాత వ్యక్తిగత రికార్డును కూడా మెరుగుపర్చుకుంది.

ఇక మహిళల హై జంప్‌ ఈవెంట్‌లో 18 ఏళ్ల యువ అథ్లెట్‌ పూజా సింగ్‌ 1.89 మీటర్ల రికార్డు ప్రదర్శనతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 2000 తర్వాత హైజంప్‌ ఈవెంట్‌లో భారత్‌కు ఇదే తొలి గోల్డ్‌ కావడం విశేషం. కాగా, ఈ పోటీలో ఉజ్బేకిస్తాన్‌ అథ్లెట్‌ (1.86మీ) సిల్వర్‌, కజకిస్తాన్‌ అథ్లెట్‌ బ్రౌన్జ్‌ మెడల్‌ దక్కించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *