అమరావతి |వివిధ ప్రాంతాలలో ఒక సంవత్సరం లోపు మూడు సర్క్యులర్ ఎకానమీ పార్కులను (ecomomy parks) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ( CM Chandra Babu) ఆదేశించారు. సర్క్యులర్ ఎకానమీపై సచివాలయంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష (review ) నిర్వహించారు.
వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై సమీక్షలో చర్చించారు. కాగా రాష్ట్రంలో సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ క్రమంలో సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 11 రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.వ్యర్థాల నుండి విద్యుత్ ప్లాంట్లలో ప్లాంట్లలో ఆధునిక యంత్రాలను మోహరించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
వారసత్వ వ్యర్థాలను వెంటనే తొలగించాలని, వ్యర్థాల విభజన, రీసైక్లింగ్పై కార్యాచరణ ప్రణాళికను 90 రోజుల్లోపు సమర్పించాలని ఆయన ఆదేశించారు. మొదటి దశలో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నంలో 400 ఎకరాల్లో ఒక పార్కును ఏర్పాటు చేయనున్నారు. మున్సిపల్, వాహనాలు, లిథియం బ్యాటరీలు, జిప్సం, టైర్లు, రబ్బర్, ఎలక్ట్రానిక్, వ్యవసాయం, పారిశ్రామిక, ఆక్వా వ్యర్ధాల నుంచి సర్క్యులర్ ఎకానమీ సృష్టించేలా కేంద్రం కార్యాచరణ చేసింది. వీటికి అదనంగా గనులు, చేనేత, పశుసంవర్ధక శాఖలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కాగా నగర పాలక సంస్థలు, పంచాయతీల్లో జీరో వేస్ట్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది.