చంద్రబాబు ఛైర్మన్ గా ఎనిమిది మందితో కమిటీ
కో ఛైర్మన్ గా టాటా సన్స్ సిఈవో చంద్రశేఖరన్
వెలగపూడి – స్వర్ణాంధ్ర 2047 (Swrnandhra) పారిశ్రామిక అభివృద్ధి సాధన కోసం ఓ టాస్క్ఫోర్స్ను (Taskforce) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నేడు ఉత్వర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ టాస్క్ఫోర్స్ ను ఏర్పాటు చేశారు . కో చైర్పర్సన్గా టాటా సన్స్ సిీఈవో చంద్రశేఖరన్ (Chandra Sekharan) వ్యవహరించనున్నారు. టాస్క్ఫోర్స్సభ్యులుగా సీఐఐ డీజీ చంద్రజిత్బెనర్జీ, అపోలో ఆస్పత్రి వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి (Preetha reddy, , సుచిత్ర ఎల్లా (Suchitra Ella) , ప్రొఫెసర్ రాజ్రెడ్డి, సతీష్రెడ్డి, జీఎం రావు , ఎల్ఎండ్ టీ చైర్మన్సుబ్రహ్మణ్యన్, ఏపీ సీఎస్విజయానంద్ ఉంటారు. స్వర్ణాంధ్ర 2047 పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఈ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి బ్లూప్రింట్తయారు చేసేలా ఈ టాస్క్ఫోర్స్పనిచేయనుంది. పారిశ్రామిక అవసరాలను అనుగుణంగా ఈ బ్లూ ప్రింట్ను రూపొందించనున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చూస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.