AP | రోడ్డు ప్రమాదంపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

శ్రీ సత్యసాయి బ్యూరో ఏప్రిల్ 13 (ఆంధ్రప్రభ):శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం ధనాపురం హైవే వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో నల్గురు మహిళా భక్తులు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర బీసీ మహిళ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

పౌర్ణమి సందర్భంగా హిందూపురం మండలం కొటిపి చౌడేశ్వరి దేవాలయంలో రాత్రి పౌర్ణమి నిద్రి చేసి అనంతరం స్వగ్రామమైన రొద్దం మండలం దొడగట్ట గ్రామానికి ఆటోలో పయనిస్తుండగా మార్గమధ్యంలో వెనుక నుండి వచ్చి గుర్తు తెలియని వాహనము ఆటోని ఢీ కొట్టింది. ఆటోలో 16 మంది పయనిస్తుండగా అందులో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులు అందరూ రొద్దం మండలం దొడగట్టు వాసులు .ఈ ఘటన పై మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు .గాయపడ్డ బాధితులు హిందూపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుండగా క్షత్రగాతులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను మంత్రి కవితఆదేశించారు. ఈఘటనకు కారకులు అయ్యిన వారిని వెంటనే శిక్షించాలని పోలీసు అధికారులకు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *