వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని కోర్టు 14 రోజుల న్యాయహిరాసత విధించింది.
అక్రమంగా క్వార్ట్జ్ మైనింగ్ చేశారన్న ఆరోపణలపై పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం ఈ ఉదయం భద్రత మధ్య కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పుడు అధికారులు ఆయనను జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్లో పలువురు చేసిన ఫిర్యాదులపై విచారణ వేగంగా సాగుతోంది.