Ap cm | ఆయనకు నాటకాలు కొత్తేం కాదు..

Ap cm | ఆయనకు నాటకాలు కొత్తేం కాదు..

నాటకాల రాయుడు నాటకాలు ఆడారు
పల్నాడులో స్వచ్ఛ రథాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Ap cm | వెబ్ డెస్క్ ,ఆంధ్ర ప్రభః వివేకా హత్య చుట్టు నాటకాల రాయుడు నాటకాలు ఆడారు. వివేకా హత్యను గుండె పోటు అని నమ్మించే ప్రయత్నం చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. నారాసుర రక్త చరిత్ర అంటూ నాపై నెట్టారు. ఇప్పుడు కూడా లడ్డూ కల్తీ చేసి హెరిటేజ్ పేరు తీసుకువస్తున్నారు. నేను ప్రాణం పోయినా తప్పు చేయనన్నారు

కొందరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బూతులు మాట్లాడుతున్నారు. రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. తప్పులు చేసిన వాళ్లు అఘాయిత్యం చేసుకునే పరిస్థితి వస్తుంది. అసెంబ్లీలో నా సతిమణిని అవమానించారు. 23 క్లేమోర్ మైన్స్ ప్రమోగించిన నేను భయపడలేదు. అప్పడు మా ఇంటి దైవం వెంకటేశ్వరస్వామి నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వరస్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోను. లడ్డూ ప్రసాదానికి వాడింది నెయ్యే కాదని సిట్ చెప్పింది. తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పల్నాడులో స్వచ్ఛరథం కార్యక్రమాని ప్రారంభించారు. పల్నాడు అంటే పౌరుషాల గడ్డ , పల్నాడు వస్తే వైబ్రేషన్స్ వస్తాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి మండలానికి స్వచ్ఛరథం వస్తుందని పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తామన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వాలనేదే తన లక్ష్యమన్నారు. అందుకు కోసం ప్రతి ఇంటికి వచ్చి చెత్త సేకరిస్తామన్నారు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వత రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురాబోతుందని తెలిపారు. అందులో భాగంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం, నేను సీఎం అయ్యేనాటికి 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని పేర్కొన్నారు.

టెక్నాలజీ వినియోగంలో దేశంలో ఏపీ నెంబర్ వన్ గా ఉంది. టెక్నాలజీ వినియోగాన్ని బిల్ గేట్స్ మెచ్చుకున్నారు. వ్యవసాయంలోనూ ఏఐ సేవలు అందుబాటులోకి తెస్తున్నాం, అలాగే రాయలసీమను హర్టికల్చర్ హబ్ గా చేస్తాం, స్త్రీశక్తి, దీపం పథకం అమలు చేస్తున్నాం, పేదల ఆదాయం పుంచేందుకు పీ4 పథకం తెచ్చాం, వాట్సాప్ గవర్నెస్ ద్వారా పౌర సేవలు, అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయి కానీ సరిగా వాడటం లేదు, 24 గంటలు లేని పొనివన్నీ చూసి సమస్యలు తెచ్చుకుంటున్నారు. సద్వినిమోగం చేసుకుంటే సెల్ ఫోన్ బ్రహ్మండమైన అస్త్రం అన్నారు. ఐటీలో మనం ముందున్నాం ఏఐలోనూ మనమే ముందుండాలన్నారు.

ఏఐ సదస్సులో కాంగ్రెస్ వాళ్ల అర్థనగ్న ప్రదర్శన ఆవేదన కలిగించింది. కాంగ్రెస్ తీరు దేశానికి మంచిది కాదని పేర్కొన్నారు.

Leave a Reply