వెలగపూడి| ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంగళవారం మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది.
సీఆర్డీయే 46 అథారిటీ సమావేశంలో ఆమోదించిన అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించుకునేందుకు సీఆర్డీయే కమిషనర్కు అనుమతి ఇస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు.