విజయవాడ : విజయవాడలో గంజాయి రవాణాను అరికట్టేందుకు పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గీతానగర్ కట్ట వద్ద వాహన తనిఖీల్లో రూ. 15 లక్షల విలువైన 200 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని తరలించేందుకు ఉపయోగించిన కారు, గూడ్స్ వాహనంను కూడా పోలీసులు పట్టుకున్నారు.
ఈ ఘటనలో రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న అండి నాగరాజు, అనబలగన్ సిన్రసు (తమిళనాడు) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఒకరు ముందుగా కారులో, మరొకరు గూడ్స్ వాహనంతో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.