- బుల్డోజర్లతో విరుచుకుపడ్డ రెవెన్యూ
- 20కి పైగా ఆక్రమణలు కూల్చివేత
- డిమాలేషన్ లో పాల్గొన్న అమీన్పూర్ తహసీల్దార్, కమిషనర్లు
అమీన్పూర్, మే 8 (ఆంధ్రప్రభ) : సుల్తాన్ పూర్ సర్వే నెంబర్ 381లోని కబ్జాలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా నేలమట్టం చేశారు. గురువారం ఆంధ్రప్రభ దినపత్రికలో సుల్తాన్ పూర్ లో ప్రభుత్వ భూమి కబ్జా అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అమీన్ పూర్ తహశీల్దార్ వెంకట స్వామి ఉదయమే కబ్జా జరుగుతున్న ప్రదేశానికి బుల్డోజర్లతో వచ్చి రూములను కూల్చివేశారు.
కమిషనర్ జ్యోతి రెడ్డి సైతం పరిస్థితిని సమీక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జారీ చేసిన పట్టాలను అడ్డం పెట్టుకుని కొంత మంది నేతలు కబ్జాలకు పేదలను అడ్డం పెట్టుకుని స్కెచ్ వేశారు. విషయం తెలుసుకున్న ఆంధ్రప్రభ కబ్జాలపై కథనం ప్రచురితం చేసింది. స్పందనగా అధికారులు కబ్జాలను నేలమట్టం చేశారు. పూర్తి విచారణ చేసి కబ్జాలకు పాల్పడ్డవారిపై కేసులు నమోదు చేస్తామని తహశీల్దార్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
