All Set |ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్ష – అన్ని ఏర్పాట్లు పూర్తి

విశాఖపట్నం రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ— ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సంయుక్త ప్రవేశ పరీక్ష ఏపీ ఐసెట్ 2025 రెండు సెషన్స్ గా నిర్వహిస్తున్నట్లు ఏపీ ఐసెట్ చైర్మన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. ఈరోజు పాలకమండలి సమావేశ మందిరంలో రిజిస్ట్రార్ ఆచార్య ఇ .ఎన్ ధనంజయరావు, సెట్ కన్వీనర్ ఆచార్య ఎం.శశి లతో కలిసి పరీక్ష వివరాలను వెల్లడించారు.

ఈ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ తో పాటు హైదరాబాదులో 94 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పరీక్షకు 37, 572 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, రేపు ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు రెండవ సెషన్ జరుగుతుంది. ఉదయం సెషన్ లో పరీక్ష రాసేవారికి ఉదయం 7: 30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతిస్తారు. మధ్యాహ్నం సెషన్ లో పరీక్షలు రాసేవారికి మధ్యాహ్నం ఒంటిగంట నుంచి పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతిస్తారు

.కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్షకు అభ్యర్థులు తమ హాల్ టికెట్, ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలి. పరీక్ష కేంద్రంలో బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ను ఉపయోగించవచ్చు. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన భద్రతా ఏర్పాట్లను చేపడుతున్నారు. హాల్ టికెట్లు cets.apsche.ap.gov.in వెబ్సైట్లో పొందుపరిచామని విద్యార్థులు డౌన్లోడ్ చేసుకుని నేరుగా పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని తెలిపారు.

పరీక్షకు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదని అభ్యర్థులు కాలాన్ని సక్రమంగా, సమర్థవంతంగా వినియోగించుకొని పరీక్షను విజయవంతంగా పూర్తి చేయాలని కన్వీనర్ ఆచార్య ఎం శశి సూచించారు. ముందుగా ప్రాథమిక కీని విడుదల చేసి, అనంతరం ఈనెల 21న ఫలితాలు విడుదల చేస్తామని ఆమె తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పూర్తి చేస్తున్నట్లు చెప్పారు.ఎండల తీవ్రత, ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని సెట్ కన్వీనర్ సూచించారు.

Leave a Reply