Adilabad | కోల్డ్ వేవ్స్!

Adilabad | కోల్డ్ వేవ్స్!
- మన్యంలో మంచు దుప్పటి
- సిర్పూర్ – యూ లో 7.4 డిగ్రీ సెల్సియస్.
- రాష్ట్రంలోనే లీస్ట్ టెంపరేచర్ రికార్డు..!
Komuram Bhima | ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి గాలుల తీవ్రత రోజురోజుకు పెరిగిపోవడంతో మన్యం ప్రజలు గజగజలాడుతున్నారు. కొమురం భీం(Komuram Bhima) అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ – యూలో 7.4 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. ఈ రోజు ఉదయం నుండే ఆదిలాబాద్, ఉట్నూర్, కొమరం భీం ఏజెన్సీ మంచు దుప్పటి కప్పుకొని పొగ మంచు ఆవహించి చలి తీవ్రత పెరగడంతో జనజీవనం స్తంభించింది.
ఉదయం పూట పల్లెల నుండి పట్టణాలకు వెళ్లే సాధారణ రైతు కూలీలు, పాలు, కూరగాయలు అమ్మే రైతులు చలిగాలులకు ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకు శీతల గాలులతో పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలు(Temperatures) ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఉట్నూర్ ఏజెన్సీలో చలి తీవ్రతకు జనజీవనం స్తంభించింది. వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఇంటి గడప దాటి బయటకు రాలేని పరిస్థితి నెల్కొండి. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో యాచకులు చలి తీవ్రతకు దుర్భర పరిస్థితినీ ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఉష్ణోగ్రతల వివరాలు..
ఈరోజు ఉదయం ఆదిలాబాద్, ఏజెన్సీలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లా సిర్పూర్ యు లో అత్యల్పంగా 7.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, తిర్యాని మండలం గిన్నిదరిలో 8.5 డిగ్రీలు(8.5 degrees in Ginnydari), ఆదిలాబాద్ జిల్లా పోచ్చెరలో 9.0, తిర్యానీలో 9.5, సత్నాల, సోనాలలో 9.6, కెరమెరిలో 9.7, భీంపూర్, ఆదిలాబాద్ రూరల్, నేరడికొండలో 9.7 మావలలో 9.8, ఆదిలాబాద్ అర్బన్ లో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని 11 మండలాల్లో సింగిల్ డిజిట్ లోనే కోల్డ్ వేవ్స్(cold waves) తో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. చలి పంజా నేపథ్యంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలను ఆరెంజ్ అలెర్ట్ గా ప్రకటించారు.
శీతల గాలుల తో అలర్ట్..
ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఏజెన్సీలో మంచు తెరలతో వాతావరణం మబ్బులు కొమ్ముకోవడం, చలిగాలుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం 9 తర్వాతే బయటకు వెళ్లాలని, రాత్రి వేళల్లో ఉన్ని వస్త్రాలు, దుప్పట్లు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొంటున్నారు.
చర్మవ్యాధులతోపాటు ఉబ్బసం, చలి జ్వరం, శ్వాస కోశ(fever, respiratory tract) సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. పిల్లలు , వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. బస్సుల్లో ప్రయాణించేవారు తప్పనిసరిగా స్వెటర్లు ఉన్ని వస్త్రాలు ధరించాలని సూచిస్తున్నారు.
