Accident | రైలు ప్రమాదంలో… ఒకరు మృతి
Accident | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ నుంచి ధారూరు వైపు వెళ్తున్న రైలులో నుంచి అదుపుతప్పి పడి అంతారం గ్రామానికి చెందిన మహేష్కు కాళ్లు విరిగాయి.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు(Railway Police) వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఆయనను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మరణించాడు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

