PACS | కొనసాగుతున్న పీఏసీఎస్ ఉద్యోగుల ఆందోళన…

PACS | కొనసాగుతున్న పీఏసీఎస్ ఉద్యోగుల ఆందోళన…
- 5వ రోజు రిలే దీక్షలు ప్రారంభం
PACS | పెడన – ఆంధ్రప్రభ : తమ డిమాండ్ల సాధన కోసం పీఏసీఎస్ ఉద్యోగులు(PACS employees) ఆందోళనను కొనసాగిస్తున్నారు. కోర్కెలను సాధించుకునేందుకు నెలరోజుల పాటు ఉద్యమాన్ని వారు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ దశల్లో ఉద్యమాన్ని నిర్వహించారు.
ఇందులో భాగంగానే ఇవాళ పెడన కేడీసీసీ బ్రాంచి ఎదుట 5 రోజులపాటు నిర్వహించనున్న రిలే దీక్షల(relay initiations)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులతో పాటు బ్రాంచ్ పరిధిలోని 15 సంఘాల ఉద్యోగులు సిబ్బంది కూడా పాల్గొన్నారు.
