- టీమిండియాను ఆదుకున్న శ్రేయస్ – అక్షర్
దుబాయి వేదికగా కివీస్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 7 ఓవర్లలో 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఓపెనర్ గిల్ (2), కెప్టెన్ రోహిత్ శర్మ (15), విరాట్ కోహ్లీ (11) పెవిలియన్ చేరుకున్నారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ పటేల్ – అక్షర్ పటేల్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నిలకడగా ఆడుతూ… 25 ఓవర్లలో భారత్ స్కోరు 100 దాటించారు.
కాగా, వీరిద్దరు కలిసి 4వ వికెట్ కు 81 పరుగులు జోడించారు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (34) పరుగులతో ఉన్నారు.