Champions Trophy | ఆలౌట్ దిశగా పాక్ !
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్ వేదికగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ ఆలౌట్ దిశగా సాగుతోంది. తాజాగా కుల్దీప్ యాదవ్ వేసిన 46.4వ ఓవర్లో నసీమ్ ఔటయ్యాడు. ఫలితంగా పాకిస్థాన్ 222 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.
ఇక ప్రస్తుతం క్రీజులో ఖుష్దిల్ షా (31) – హరీస్ రౌఫ్ ఉన్నారు. పాకిస్థాన్ స్కోర్ 48 ఓవర్లకు 227/8.