భక్తి శ్రద్దలతో నాగులచవితి
చెన్నూర్ అక్టోబర్ 25(ఆంధ్రప్రభ ) నాగులచవితి పర్వదినాన్ని శనివారం చెన్నూరులో భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయాన్నే మహిళలు శివాలయాలకు చేరుకొని నాగేంద్రుని పుట్టల వద్ద పాలుపోసి నైవేద్యం సమర్పించి భక్తిని చాటుకున్నారు.