రూట్ మార్చిన సైబర్ నేరగాళ్లు.. జంప్ డిపాజిట్ పేరుతో మోసం

యూపీఐ యాప్ లో డబ్బులు వచ్చాయని మెసేజ్ వస్తుంది. మనం చెక్ చేసుకోగానే మన బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుంది. వాస్తవానికి వాళ్లు పంపించేది మనీ రిక్వెస్ట్ మెసేజ్ మాత్రమేనని సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది. ఇలా డబ్బుల వచ్చాయని మెసేజ్ లేదా సూచనలు రాగానే బ్యాలెన్స్ చెక్ చేసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. బ్యాలెన్స్ చెకింగ్ కోసం యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే పలు డబ్బులు మన ఖాతాలో నుంచి అవతలి వ్యక్తులకు పోతాయని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలపై ఇప్పటికే ఫిర్యాదులు అందినట్లు సైబర్ బ్యూరో అధికారులు వెల్లడించారు. గోల్డెన్ అవర్ చాలా ముఖ్యం సైబర్ క్రైమ్ లో మోసపోయిన వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరోను సంప్రదించాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. ఏదైనా లావాదేవీలో మోసం జరిగిందని భావిస్తే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాల ని చెబుతున్నారు. గోల్డెన్ అవర్ అనేది చాలా ముఖ్యమని, ఫిర్యాదు వెంటనే చేసినట్లయితే లావాదేవీలు జరిగిన అకౌంట్లు గుర్తించి వెంటనే ఫ్రీజ్ చేయొచ్చని సైబర్ బ్యూరో వెల్లడించింది.

కంబోడియా వేదికగా.. సైబర్ క్రైమ్ నేరాల్లో 70శాతం కంబోడియా వేదికగా జరుగుతున్నాయని, తర్వాత దుబాయి, చైనా దేశాల్లో జరుగుతున్నట్లు నేషనల్ సైబర్ క్రైమ్ గుర్తించింది. సైబర్ నేరగాళ్లు విదేశాల నుంచి ఏపీకే ఫైల్స్ ను పంపిస్తూ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ట్రెడింగ్ యాప్ పెట్టుబడి మోసాలు, లోన్ యాప్ ఇంకా పలు విధాలుగా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ తర హాలోనే ఇప్పుడు కొత్తగా జంప్ డిపాజిట్ (Jump Deposit fraud) చేరింది. మనీ రిక్వెస్ట్ యూపీఐకి మెసేజ్ పంపించి డబ్బును లూటీ చేస్తున్నారు. ఈ తరహా మోసాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Leave a Reply